Thursday, June 30, 2016 2 comments By: visalakshi

మా విశాలహృదయంలో సమాలోచనలు..గాయత్రీమహామంత్రం...

.గాయత్రీమహామంత్రం:-- 





 హే రక్షకా! సచ్చిదానంద స్వరూపా, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావా, అజ,నింజన, నిరాకార, సర్వవ్యాపక, సర్వాంతర్యామిని, జగదుత్పాతక దేవా, నీ దివ్యమూ వరేయము నైన సచ్చిదానంద స్వరూపమును మేము సర్వదా మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధి నిచ్చి బ్రహ్మచర్యాది సద్ వ్రతములను ఆచరించునట్లు మమ్ము అనుగ్రహింతువు గాక! 

 ఈ గాయత్రీ మహా మంత్రములో మొదటి భాగంలో ప్రణవం, రెండవ భాగంలో 3 వ్యాహృతులు, మూడవ భాగంలో త్రిపదా గాయత్రి అనే మూడు భాగాలున్నాయి.

ప్రణవంలోని మూడు మంత్రాలు సృష్టి, క్రమ చిహ్నాలు..ఈ మూడింటి  ఉచ్చారణ వలన క్రమంగా భూలోక, భువర్లోక ,స్వర్లోకములేర్పడుచున్నాయి.ఇవే పృద్వి, అంతరిక్ష, ద్యులోకాలు. సప్త చంధస్సులలో గాయత్రి కూడా ఒక చంధస్సు. ఇందులో మూడు పాదాలున్నాయి. అందుకే దీనిని త్రిపదా గాయత్రి అంటారు. త్రివిధ లోకాలు, త్రివిధదేవతలు,త్రివిధ అగ్నులు, త్రివిధ గుణాలు, త్రివిధ దు:ఖాలు మొదలైన రహస్యాలు ఈ త్రిపదా గాయత్రిలో ఇమిడి ఉన్నాయి.

 గాయత్రీ మంత్రములో పరమాత్మను "సవితా" అనిసంబోధిస్తాము.సవితకు సంబంధించింది కనుక దీనికి సావిత్రి అని పేరు. ఈ మంత్రాధి దేవత సావిత్రి.(సవిత పుత్రిక సావిత్రి).




 ప్రతినిత్యం బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి,కాలకృత్యాలు తీర్చుకొని, ఏకాంతంగా పద్మాసనంలో కూర్చుండి, అత్యంత శ్రద్ధా నిష్ఠలతో ఈ జపాన్ని చేయాలి.అందువలన బుద్ధి సూక్ష్మమై వేగవంతమవుతుంది..ధారణాశక్తి, మనోనిగ్రహం, స్మరణ శక్తి పెరుగుతాయి. తద్వారా ఉత్సాహం, ఆత్మానందం కలుగుతాయి. ప్రచోదయాత్ అనే శబ్దార్ధం జీవితంలో ప్రవేశించి, మానవజీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 

  సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో ఈ  జపం చేయడం వలన శుభం కలుగుతుంది.సృష్టికర్త సృష్టికర్తృత్వాన్ని తెలుసుకునేందుకు ఈ మంత్రజపం ఎంతగానో సహకరిస్తుంది. ఈ మంత్రంలో (సవితా) పరమాత్ముని కేవలం జ్ఞానం కొరకే ప్రార్ధిస్తాము.మానవునకు జ్ఞానమే ముఖ్యమైన జీవన సాధనం.శాశ్వతానందాన్ని కలిగించే జ్ఞానాన్ని మాత్రమే కోరాలి.జ్ఞానమే శాశ్వతం.

 ఈ గాయత్రీ మంత్రములో న: శబ్ధములో విశాలమైన అర్ధం ఉంది.సమస్త మానవులు -స్త్రీ పురుషులందరూ ఈ గాయత్రీ మంత్రాన్ని జపించి సమాన ఫలం పొందవచ్చు. ఒక వర్ణం వారికి అధిక ప్రయోజనం, మరొక వర్ణం వారికి అల్ప ప్రయోజనమనే సంకుచిత భావం ఈ మంత్రములో లేదు. కానీ ఈ మంత్రజపం చేసేవారు శిష్టాచార సంపన్నులు, సదాచారవంతులు, పూర్ణాచారవంతులు, శీల సంపద గలవారు అయి ఉండాలి. ..వారు ఏ వర్ణానికి, వర్గానికి, చెందిన వారైనా ఈ శుభలక్షణాలు కలిగిన స్త్రీ పురుషులందరికీ సమాన ఫలం ఉంటుంది.

  గాయత్రిని జపించే అధికారం స్త్రీ పురుషులకు నిశ్చయముగా ఉంది. వైదికుల లక్ష్యం, వారి జీవన ధ్యేయం గాయత్రీ మంత్రజపమే! గురుకుల విద్యాభ్యాసం నుండి మొదలై చివరి ప్రాణ త్యాగం వరకు ఈ గాయత్రీ మంత్రం తోనే వారి జీవన సూత్రాన్ని అవినాభావ సంబంధంగా ముడివేసుకుంటారు. ప్రాచీనకాలంలో ఈ గాయత్రీజపం ఋషులు, మునులు,సాధుసత్పురుషులు అందరూ చేసేవారు. వారికి ఋష్యత్వం సిద్ధించడానికి మూలమంత్రం గాయత్రీయే! వేదకాలం నుండి ఋషి మునులు వాణి వాజ్ఞ్మయాదుల ద్వారా ఈ గాయత్రీ మహిమను వేనోళ్ళ కీర్తించారు. ..ఋషులు మంత్రదష్టలైనవారు పరమాత్ముని నుండే నేరుగా ఈ జ్ఞానాన్ని పొందుతారు. 


సర్వశ్రేష్ఠమైన ఈ గురుమంత్రాన్ని జపించి ఆత్మవిశ్వాసం, ఆత్మబలం పొందగలం.  ...... visalakshi.  ......

****               ****                ****                     ****

     కారణజన్ములు మినహాయిస్తే సాధారణంగా మనమంతా పూర్వం జేసిన కర్మల ఫలితంగానే జన్మలెత్తుతున్నాం అన్నది విస్పష్ఠం. అయితే ఎవరి పుట్టుకా యాదృచ్చికంగా సంభవించేది కాదు. ఏదో పొరపాటు వలనో, ప్రకృతి ప్రేరకం వల్లనో మనం ఊపిరి పోసుకోలేదు. ఏ జన్మలోనో మనం చేసుకొన్న పాప పుణ్య కర్మల వల్ల ఆ ఫలం అనుభవించడానికి ,వాటికి అనుగుణంగా దేహం తగిన బంధు మిత్ర పరివారంతో ఈ లోకంలోకి ప్రవేశించాము. అలా ప్రారబ్ధంగా సమకూరినవే ఈ బంధాలన్నీ...బాధలన్నీ!..



  ఆ మనుషుల ఋణం, కర్మఫలం తీరటానికి ప్రతి ఒక్కరికీ భగవంతుడు కొంతకాలాన్ని నిర్దేశించాడు. దానికి ఆయుష్షు అని పేరు పెట్టుకొని, అది తీరేవరకు ఆ కర్మలు ఆడించినట్లు ఆడుతూ ఉంటాము. వాటి నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యము కాదు.   




  "మనిషిగా పుట్టిన మనకే ఈ  మానవ జన్మ విలువ తెలియదు. ...మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమని బహుశా మూగజీవాలకు తెలుసేమో!"

...విశాలాక్షి.  .....
Wednesday, June 29, 2016 0 comments By: visalakshi

మా విశాలహృదయం సమాలోచనలు..ఆధ్యాత్మికం..విదురనీతి..పేరు..

 ఆధ్యాత్మికం :---




 ఆధ్యాత్మికం అంటే ...పరమాత్ముని తెలుసుకోవడం...ఆయనను ఏ విధంగా ఉపాసించాలి, వేదాలలో ఆయన లక్ష్యమేమిటి, ఆత్మ పరమాత్మతత్వం తెలుసుకొనే ప్రయత్నంలో సాధన, అధ్యయనం, అభ్యాసం, ధ్యానం మొదలైన అంశాలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ సాధకులు ఆ పరమాత్మ లీలానుగ్రహాలను అనుభవిస్తూ తాదాత్మ్యం చెందుతూ అంతర్యామి అయిన పరమాత్మను తన హృదయమనే కోవెలలో కొలుస్తూ....జ్ఞానాన్ని విస్తరింపజేయడమే ఆధ్యాత్మికం.      ....    విశాలాక్షి...


 ఆధ్యాత్మికత ఆత్మకు సంభందించినది. పరమాత్మకు సంభందించినది. ఆత్మను తెలుసుకొని,పరమాత్మలో కలిసిపోయే సాధనకు సంభందించినది. పాజిటివ్ తప్ప నెగిటివ్ లేనిది. ఒక్క మానవ జన్మ పొందాలంటే ఒక అణువు ఎన్నో జన్మలు తీసుకోవాలట. పాప పుణ్యాల చిట్టాలు కరిగి పోవాలట. శూన్య స్థితికి చేరుకున్ననాడు కేవలం ఆ పరమాత్మను ధ్యానిస్తూ ....వెదుకుతూ... తపన చెందుతూ....మెల్ల మెల్లగా ఆ పరమాత్మను చేరుకునే దిశగా సాధనాభ్యాసాలను పట్టుకోవాలట...రుక్మిణీ దేవి...

మీరు బాగా చెప్పారు విశాలాక్షి గారూ ..మీరు కనబడక పోయేసరికి అనుకున్నాను సోధనా దిశలో ఉండి వుంటారని....రుక్మిణీ దేవి..      



 విదురనీతి:--

 మనిషికి కోపం ఉండకూడదు...ఉన్నట్లు నటించవచ్చు.....దురహంకారం పనికిరాదు.

పరాయి స్త్రీని తల్లిలా చూడాలి. ఆమె ఎదురవగానే తలవంచుకొని వెళ్ళిపోవాలి అని విదురనీతి.                 .....రుక్మిణీ దేవి.....



 ధర్మార్ధాలను అనుసరిస్తూ; లోక వ్యవహారం గ్రహిస్తూ; భోగచింత లేకుండా పురుషార్ధాలను సేవిస్తూ, అప్రస్థుత ప్రసంగాలు చేయకుండా, దుర్లభాలు వాంచించకుండా, పోయినవాటి కోసం శోకించకుండా ఎటువంటి విపత్తులు వచ్చినా, ధైర్యం కోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయనిదే విడువకుండా, సోమరితనాన్ని దరిజేరనివ్వకుండా మనస్సును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు.



 ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరణకి ఆగ్రహం పొందడం విద్వాంసుల లక్షణం కాదు. వారి హృదయం గంభీరంగా గంగానదీ సదృశంగా ఉంటుంది.

ఒంటరిగా భోజనం చేయకూడదు...సహనం, క్షమ, సమర్ధత కలిగి ఉండాలి.

కుటుంబంలోని వృద్ధులను, బీద కుటుంబీకులను, సంతాన విహీనులు అయి, భర్తను కోల్పోయిన సోదరినీ ఆదరించి, ఆశ్రయమిచ్చి పోషించాలి.                    ..విశాలాక్షి.....


 పేరు.:---

 పాప, బాబు ఎవరు జన్మించినా, రాముడంతటి వారవ్వాలనో, దేశం గర్వింప దగ్గ వారవ్వాలి అంటూ...భగవంతుని, దేవతల, నేతల పేర్లు పెడతారు....సార్ధక నామధేయులవ్వాలని దీవిస్తారు తల్లిదండ్రులు..

ఒక వ్యక్తిని గుర్తించాలంటే పేరు ద్వారా రూపం మనసులో మెదులుతుంటుంది....ఆ వారి అబ్బాయి...అమ్మాయి వగైరా!.. 



 వ్యక్తి ఉండకపోయినా, పేరుని బట్టి వారి చరిత్రను బట్టి, కీర్తిని బట్టి ఆ వ్యక్తిని తెలుసుకోగలం.

  పేరుప్రతిష్టలు, వంశగౌరవం నిలబెట్టాలని, తండ్రి పేరు నిలబెట్టాలని, ఫలానా వారి అబ్బాయి,లేక అమ్మాయి అనగానే ఆ వ్యక్తికి గర్వంతో ఆనందంతో తనువు పులకిస్తుంది..

  రూపం చూడకపోయినా మనసులో ఆ వ్యక్తి పేరుతో మానసికంగా ఇష్టపడగలం.

 పేరుని నిలబెట్టుకోవాలని, పేరు కోసం  చేయరాని పనులు, ఇతరులను నిరసించడం, అవమానించడం, ఏ నీచ త్వానికైనా  దిగజారే మనుషులూ ఈ లోకంలో ఉన్నారు. 



 ఆధ్యాత్మికంగా, దేశభక్తితో పరుల శ్రేయమును కోరి, పేరుకై కాక దేశాభివృద్ధికై పాటుపడిన వారెందరో మహానుభావులు..అందరికీ వందనాలు....             visalakshi................. 






Tuesday, June 28, 2016 1 comments By: visalakshi

మా విశాలహృదయం సమాలోచనలు...ప్రేమ:---.. మౌనం.... శాంతి...

  "విశాలహృదయం" అనే పేరుతో రుక్మిణిగారు ఒక గ్రూప్ ను వాట్సాప్ లో క్రియేట్ చేసారు..మేము మాట్లాడుకున్న కొన్ని ప్రధానాంశాలను...చదువరుల కోసం...

 ప్రేమ...ఇది ఆధ్యాత్మిక,లౌకికములతో కూడిన విధంగా...తెల్లవారుఝామున మెలుకువ రాగానే వినిపించే   కోకిల రాగాలు, కిటికీ నుండి లొపలికి వస్తూ చల్లగా పలకరించిన చిరుగాలి, కళ్ళముందు మీరు ఇద్దరూ, హృదయంలో బాబాగారు...అప్పుడే నా మనసులోకి ఈ టాపిక్ ను తెచ్చాయి...కాబట్టి మీ ఇద్దరూ  ఏమి చెప్తారో వినాలని ఉంది...                         రుక్మిణీదేవి......

 ప్రేమ ...చాలా మంది పెద్దలు చాలా విధాలుగా నిర్వచించారు...ఒక్కొక్కరిదీ ఒకో మధురానుభూతి...నా దృష్టిలో ప్రేమ అంటే ఆరాధన...వ్యక్తిగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా,ఏ కోణంలో నైనా మైమరచి,తనను మరచి ఆరాధించడమే ప్రేమ...ఒప్పుకుంటారా ఫ్రెండ్స్...            విశాలాక్షి..




 ప్రేమ ... 17/10/2011 లో ఈ ప్రేమ గురించి నా అభిప్రాయం "స్మరణ" లో చెప్పాను.వీలైతే చూడండి ఫ్రెండ్స్...కొంచం బిజీగా ఉన్న కారణంగా వివరించలేకపోతున్నాను.......భారతి...


  ***                   ***                ***             ***             ***             ***           ***                  


 మౌనం...మౌనం అనేది సాధనా!...మౌనం వల్ల ఏమి సాధించవచ్చు? మిత్రుల మధ్య మౌనం సంతోషమా!..బాధాకరమా... మౌనం వల్ల ఏం కోల్పోతారు? ..ఏం పొందుతారు? మాట్లాడి సరిదిద్దుకోలేనిది..మౌనంలో సరిదిద్దబడుతుందా?  ..మౌనం అంతరార్ధం మనసు మూగబోవడమా  లేక ఆర్ధృమవడమా ! ఈ ప్ర శ్నలకు ఇద్దరూ మీ మనసుతో ఆలోచించి సమాధాం చెప్పండి...?   ......   విశాలాక్షి.....


 మంచి ప్రశ్న విశాలాక్షి గారు..మౌనం సహజమయినది..సాధనతో కూడా పొందవచ్చు.. మౌనం అంటే పైకి మాట్లాడకుండా లోపల మధనం కాదు. మిత్రుల మధ్య మౌనం సంతోషకరం కాదు.. కానీ తప్పని సరియై తన మౌనం ఆ ఎదుటి వ్యక్తులను నిందించుట లేక తూలనాడుటలాంటి విపరీత భావనలను అధిగమించవచ్చు... ఒకరిని ఏమైనా అన్నాము అనుకోండి..అది మౌనం  తో కాక మాటలతో,లేక చేతలతో సరిదిద్దగలము. ..సాధ్యం కాకపోతే మౌనం వహించక తప్పదు...ప్రయత్న పూర్వకంగా మనసు మూగబోతే అది తాత్కాలిక మౌనం అవుతుంది. ఆర్ధ్రమవడం అంటే వేదన ఎక్కువవుతుంది.అది సహయుక్తం కాదు. మనసులో రకరకాల ఆలోచనలతో ఉండి పైకి మాట్లాడడం మౌనం కాదు...శారీరక, మానసిక సంతులనతో ఉండి, సహజ స్థితిలో ఉండగలిగిన నాడు మనస్సును స్వాధీనంలోనికి తెచ్చుకున్న నాడు "మౌనం " ఎరుకలోకి వస్తుంది. ఈ మౌనంలో ఆనందమే ఉంటుంది..అందరి పట్ల సయోధ్య ఉంటుంది.. సాధనకు సంపూర్ణ స్థితిని అలవరిస్తుంది..నేను మౌనం వహిస్తున్నాను అని చీటికి, మాటికి అనుకునేది ప్రేమతో కూడినది.మాట్లాడటం వలన ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా ఉండకూడదు..అది తాత్కాలికం....          రుక్మిణీ దేవి.... 


 రుక్మిణీజీ మీ విశ్లేషణ చక్కగా ఉంది..భారతి...

" మౌనం మౌనమనేది సాధనా? అవునని చెప్తున్నాయి మన శాస్త్రాలు.. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలం..."యోగస్య ప్రధమం, ద్వారం  వాజ్ఞి రోధ: " అన్నారు శ్రీ శంకరులు. మౌనం అనేది చింత, చింతన లేని తపస్సు. మనస్సుకు వాక్కుకు అందని పరమాత్మ తత్వం,మౌనం ద్వారానే సృశించగలమన్నది అనుభవజ్ఞుల
మాట.



 మిత్రుల మధ్యనే కాదు, ఏ బంధంలో నైనా అర్ధవంతమైన మౌనముంటే అది ఆనందదాయకమే. బలవంతంగా మౌనమయినా, ఆవేదనతో మౌనమయినా అది దుఖదాయకం..భరించడం కష్టమే! అపుడు ఆ బాధను పడేకంటే మాట్లాడి మనసులను దగ్గర చేసుకోవడమే ఉత్తమం. రెండు మనసుల మధ్య వాక్కు అనే వంతనను వేసుకోవడం ధర్మం. అయితే దానికంటే ముందు ఒకింత స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఏ కారణంచే ఎదుటివారు మౌనమయ్యారు, నాలో నొప్పించే అంశాలు ఏమున్నాయి? ఎదుటివారి మౌనంకు కారణమేమిటి?ఇత్యాది స్వశోధన చేసుకొన్నాక మాట్లాడితే తర్కవితర్కాలుండవు..గమనిస్తే, ఎదుటి వారి మౌనం మనకో బోధ కావచ్చు.....భారతి...






  మౌనం అంతరార్ధం ఇదని మాటల్లో చెప్పేకంటే అనుభవంలోకి వచ్చినపుడు అదేమిటన్నది వారి,వారి మానసిక భావనలను బట్టి అర్ధమవుతుంది.....   భారతి...


మీకు తెలియక కాదు గానీ విశాలాక్షి గారూ గుడ్ టాపిక్.. భారతిగారూ బాగుంది వివరణ....     రుక్మిణీ దేవి......

                      
                                 ***                ***              ***            ***           ***



 శాంతి....ఒక వ్యక్తి తన గురువు వద్దకు వచ్చి స్వామీ! " I WANT PEACE"   అన్నాడట...  ఏమిటి? అన్నారట     గురువుగారు  " I WANT PEACE"     అన్నాడట ఆ వ్యక్తి.  I  తీసేయి నాయనా!..నేను,నాది తీసేయి అన్నారట గురువు..ఇంకేమి మిగిలింది అన్నారట  WANT PEACE" .....want  కోరిక కూడా తీసేయి నాయనా!అన్నారట.. ఇప్పుడేమి మిగిలింది. Peace..శాంతి... నేను నాది అనే అహంభావమును తీసేసి, కోరికను జయిస్తే శాంతి కలుగుతుంది అని అర్ధము చెప్పారు గురువుగారు...ఓం శాంతి: శాంతి: శాంతి:......visalakshi...




  ఆధ్యాత్మిక పరమైన అంశాలు తదుపరి టపాలో.........mitrulaku abhinamdanalato......visala....






















             - 

Saturday, June 25, 2016 5 comments By: visalakshi

స్నేహం-మైత్రి-చెలిమి..

  ఓం శ్రీ ఫరమాత్మనే నమో నమ:
 ఈ భూమిమీదకు తెచ్చి నేను, నాది అనే ఉనికిని,జ్ఞానాన్ని కలగజేసిన నా మాతృమూర్తికి వందనం..అభివందనం....అలా జీవితం ఇచ్చిన అమ్మ నా మొదటి స్నేహితురాలు...అడుగులు నేర్పుతూనే ఆసరాగా ఉండాల్సిన నాన్నగారు నా రెండవ స్నేహితుడు...అర్ధాంతరంగా..దైవ సన్నిధికి చేరుకున్నారు...బాల్య మిత్రులు..మా బడిలో (సెయింట్ థెరిసాస్ స్కూల్)అందరం స్నేహితులమే! నిష్కల్మషంగా ఎటువంటి తరతమ భేదాలు లేకుండా మైత్రీ భావనతో ఉండేవారము. ఉపాధ్యాయులు,విధ్యార్ధులు కుడా క్రమశిక్షణతో పాటు..స్నేహభావంతో ఉండేవారు..విభిన్న స్వభావాలతో ఏకత్వం...ఒక్క క్రిస్మస్ పండగ రోజు జీసెస్ జననం గురించి నాటకం వేయించేవారు తప్ప ఎపుడూ మత ప్రస్తావన లేని స్కూల్ మాది.. ఆ టైములోనే అలెలూయా అని పాటలు నేర్చుకొని ఇంట్లో సరదాగా పాడితే అమ్మ చంపేస్తాను.. అవి స్కూలు వరకే అని చెప్పింది...ఇక అనుకరణలు అద్భుతంగా ఉంటాయి కదా.. బాల్యంలో నా స్నేహితురాలు ఎడం చేత్తో రాస్తోందని నేను కూడా నేర్చుకుందామని రాయబోతే అమ్మ వారించి, కుడి చేత్తో రాయాలి అని కఠినంగా చెప్పి నన్ను సరిదిద్దిన స్నేహమయి..అదే స్నేహితురాలితో జండా వందనం జరిగే ప్రతి స్కూల్ కి వెళ్ళి ఇద్దరం దేశభక్తి గీతాలు పాడే వారం..ఇపుడు తను హోమియో డాక్టర్..10వ తరగతి   వరకు ఆ స్కూల్ లో చదివిన మేము కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము.. ఇంటికొచ్చి మధ్యాహ్నం భోజనం చేసేటపుడు నా స్నేహితులు అమ్మ వంటను ఆస్వాదిస్తుంటే అదో మధురానుభూతి.. అలకలు, కోపాలు కలహాలు...కలిసిపోవడాలు.. చెలిమిలో అన్నీ అపురూపమే కదా! 


























 16 సం"ల ప్రాయంలో కళాశాలలో స్నేహితులు...కొత్త స్నేహాలు.. ఆ జీవితం వేరు ...అప్పటివరకు తెలుగుమీడియం చదివి..తడబడుతూ ఇంగ్లీష్ మాట్లాడడం స్నేహితుల ఎగతాళితో చిన్నబుచ్చుకోవడం.. ఆడవాళ్ళం కాబట్టి మాలో మాకు అందం గురించి చర్చలు... సినిమా హీరోయిన్లతో పోల్చడాలు ..మా ఎం.పి.సి గ్రూప్ లో ఒక ముస్లిం అమ్మాయి ఉండేది ..అద్భుత సౌందర్య రాశి... మేమందరం ఆమె ఎప్పుడు వస్తుందా! అని ఎదురు చూసేవారము. తను నేరుగా వచ్చి నా పక్కన కూర్చునేది.. నేను సంభ్రమాశ్చర్యాలతో తనని చూస్తుంటే నాతో మాట్లాడి నా వివరాలు అడుగుతుంటే ..నా సంతోషం చూడాలి..అలా మేము స్నేహితురాళ్ళమయ్యాము. ఒక రోజు తన ఫొటో నాకు ఇచ్చి, నేను స్టేట్స్ వెళిపోతున్నాను అని చెప్పి ఖుదా అఫీస్ అని చెప్పింది...కళాశాల స్నేహాలు కొన్ని మాత్రమే జ్ఞాపకాలుగా మిగిలాయి.. కానీ పాఠశాల స్నేహితులు ఇప్పటికీ కలుసుకుంటున్నాము..మైత్రిని పెంపొందించుకొంటున్నాము...

 నా స్కూల్ డేస్ లోనే పరిచయమైన నా అన్నగారి స్నేహితుడు..నా ప్రేమికుడు ..నా అంతరంగ స్నేహితుడు...మరెవరో కాదు..మా శ్రీవారు..13 ఏళ్ళ ప్రాయం నుండి తెలిసిన స్నేహితుడు,నా మది దోచుకున్న నా హితుడు, సఖుడు, అన్నీ తానే అయి ఇప్పటికీ ,ఎప్పటికీ  నా అంతరంగిక మిత్రుడు.. బాబాగారి దీవెనలతో మాది జన్మ జన్మల బంధం అని తెలిసినా...ఈ జన్మ బంధం స్నేహం, ప్రేమ కలగలిపి అద్వితీయమైన అనుభూతినిచ్చిన బంధం..



















 బ్లాగు మిత్రులు...కొత్తగా బ్లాగు రాయడం మొదలు పెట్టినపుడు.. ఒక పది మంది బ్లాగు మిత్రులుండేవారు.. కాలక్రమేణా రాయడం కొన్నాళ్ళు మానేసాను. ఆ తరువాత మరల బాబాగారి లీలలను రాయడం మొదలు పెట్టాను.. అప్పటికి అంతర్జాలంలో చాలా మార్పులు ..ఎందరో బ్లాగర్లు...ఎన్నో మంచి రచనలను చూసాను.  అద్భుతమైన శైలితో ఎన్నో స్పూర్తిదాయక రచనలను అందిస్తున్న బ్లాగరులందరికీ వందనములు... 





బ్లాగు రాయడానికి శ్రీకారం చుట్టించిన ఘనత మా పాపది..తను నాకు మనోస్నేహితురాలు..అన్నీ షేర్ చేసుకుంటాము. ఇక బాబాగారి లీలలను రాయుట మొదలు పెట్టినపుడు ...కొన్ని బ్లాగులను చదవడం జరిగింది. అదీ తన ఒక వ్యాక్య ద్వారా,...నేను ఒక బ్లాగరు బ్లాగు చదివి, స్పందించి..వారి స్నేహం కోరి, వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం గాఢ ఆత్మీయ బంధంగా మారింది. (తనద్వారా మరొక బ్లాగరు పరిచయమయ్యారు.ఆ పరిచయం స్నేహ బంధమయింది.) మూడు సంవత్సరాలుగా మా ఆత్మీయ బంధం మరింత బలపడి అప్పుడప్పుడు చిరు కలహాలతో, అలకలతో, ఆధ్యాత్మిక అనుభూతులతో, అప్పుడప్పుడు వాదోపవాదాలతో...అల్లరి ఆట పట్టింపులతో... అన్ని విధాల మా అపురూప బంధం ఏకాత్మ భావనతో కొనసాగుతోంది..మేమిరువురం ఒకరినొకరు చూసుకోలేదు... ఉద్దేశ్యపూర్వకంగా మనం కలవకూడదు...మనల్ని ఎప్పుడో భగవంతుడే కలుపుతాడు.. అన్న తన ఆలోచనకు నేను అంగీకరించాను.మా ముగ్గురు స్నేహితురాళ్ళము అణువంత తెలిసిన ఆధ్యాత్మిక అవగాహనను ఒకరికొకరు పంచుకొంటాము..అలా పంచుకొన్న కొన్ని వ్యాసాలను, భావనలను...తరువాతి టపాలో వివరిస్తాను... 

 నాలో ఉండి నన్ను నడిపిస్తున్న శ్రీ సాయినాధునికి సర్వదా కృతజ్ఞతాంజలి ఘటిస్తూ....వేద.....